E.G: వేసవిలో కరెంటు సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఏపీ డీసీఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యలు రాకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.