కృష్ణా: సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ వేదికను రాజకీయం చేయవద్దంటూ గౌడ సంఘానికి చెందిన పలువురు నాయకులు స్పష్టం చేశారు. నూజివీడు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో సోమవారం ఆరేపల్లి శ్రీనివాసరావు, పామర్తి నాగేంద్రులు మాట్లాడారు. గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినట్లు తెలిపారు.