BPT: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామంలో సోమవారం రాత్రి మహిళ మెడలో గొలుసు చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఈ నేరానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందోలు ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.