VZM: ఈ నెల 26 నుంచి 31 వరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఇందు కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, MRO, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు భాగస్వాములుగా పని చేయాలన్నారు. ఈ మేరకు హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయ రంగాల్లో బాలకార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.