KDP: పెండ్లిమర్రి మండలం రేపల్లె గ్రామం వద్ద ఏర్పాటుచేసిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తల, చేతి భాగాన్ని ధ్వంసం చేశారని టీడీపీ మండల నాయకుడు ఎస్పీ గంగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.