E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన అంతర్ కళాశాల ఆర్చరీ (విలువిద్య) టోర్నమెంట్లో S.K.V.T ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి తేలం అజయ్ బంగారు పతకం సాధించాడు. సోమవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ DV రమణమూర్తి మాట్లాడుతూ.. 30 మీటర్ల విభాగంలో అజయ్ ఈ బంగారు పతకం సాధించినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో 50 మీటర్ల పోటీకి అర్హత సాధించినట్లుగా తెలిపారు.