KRNL: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని పరిసరాల్లో తుంగభద్ర నదీ తీరంలో మొసళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆదివారం మాధవరం వంకలో మొసలి కనిపించగా, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు ఆసక్తిగా వీక్షించారు. మొసళ్లు తరచూ దర్శనమిస్తున్న కారణంగా నది తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.