KDP: సిద్దవటం మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంఛార్జ్ కమాండెంట్ డి.నాగేశ్వరప్ప పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమాండెంట్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.