SKLM: భూ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని ఆమదాలవలస MRO రాంబాబు అన్నారు. సోమవారం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన సదస్సులో భూ వివాదాలు, ఆక్రమణలు పై ఫిర్యాదులు స్వీకరించమన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ P.సూరపు నాయుడు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి S.ఢిల్లేశ్వర్ రావ్ గ్రామంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.