KDP: సిద్ధవటం మండలం మాధవరం -1 పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో గత కొద్దిరోజులుగా మంచినీటి పైప్లైన్ డ్యామేజ్ అయ్యింది. తాగు నీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పంచాయతీ సెక్రటరీ చేపూరి లక్ష్మీనరసయ్య చొరవ తీసుకొని పైప్లైన్కు మరమ్మత్తులు చేయించి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు.