ఎన్టీఆర్: నాటు సారాను తయారుచేసి విక్రయించిన రెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురిని బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు మైలవరం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని బండయ్య, రమాదేవి, మల్లది ఏసు సారా విక్రయించేవారు అన్నారు. వీరిని తహశీల్దార్ ఎదుట హాజరుపర్చి బైండోవర్ చేసినట్లు తెలిపారు.