ATP: కంబదూరు మండల కేంద్రంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 19న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి రామ్మోహన్ రెడ్డి మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు రూ.3000 డిపాజిట్ కట్టి ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు అన్నారు.