NTR: విజయవాడ నగరంలోని 15 డివిజన్ దర్శిపేట ఎన్ఎస్ఎల్ స్కూల్ మెయిన్ రోడ్డులో ఉన్న జీడిపేట ప్రభుత్వ స్కూల్లో పునరావాస కేంద్రాన్ని వీఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, దర్శిపేట, పటమట డొంక రోడ్డు, బందర్ కాలువ గట్టు ప్రాంతాల్లోని తుఫాను బాధితుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.