AKP: విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కోటవురట్ల మండలం ఎండపల్లి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జ్వరాలతో బాధపడుతున్న పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు.