ATP: తాడిపత్రిలోని పౌరసరఫరాల స్టాక్ పాయింట్పై ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై డీఎం రమేశ్ క్షేత్రస్థాయికి చేరుకుని గోడౌన్లో ఎంత సరుకు ఉందో పరిశీలిస్తుండగా రేషన్ డీలర్లు కంది ప్యాకెట్లు ఇచ్చారు. అందులో కేవలం గాలి మాత్రమే ఉందని, కందిబెడలు లేవని చెప్పడంతో ప్యాకెట్ చూసి అధికారులు అవాక్కయ్యారు.