SKLM: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శనివారం సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. దీనికోసం రూ. 4 కోట్ల 36 లక్షల రూపాయలు నిధులు కేటాయించామని అన్నారు.