కడప: గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ MLC రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అంతక్రియలు కడపలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి కడప కో ఆపరెటీవ్ కాలనీ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం శివారులోని చలమారెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేయనున్నట్లు తెలిపారు.