VSP: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం పోలీసులు డాగ్ స్క్వాడ్స్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, గోపాలపట్నం, సీతమ్మధార, జగదాంబ సెంటర్, మహారాణిపేట తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. అలాగే కొరియర్ కేంద్రాల్లోని పార్సిల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు.