కృష్ణా: పెడన–గుడివాడ రహదారిలో ఈద్గాలో రంజాన్ పర్వదినం దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని,ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌహార్ద్రం నెలకొనాలని ఆకాంక్షిస్తూ, రంజాన్ పర్వదినం అందరికీ ఆనందం, సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు.