అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేట బేరైటీస్ గనుల నుంచి వస్తున్న దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మవరం క్రాస్ వద్ద మండల కార్యదర్శి నాగమ్మ ఆధ్వర్యంలో కార్యకర్తలు చీపుర్లతో రోడ్డు ఊడుస్తూ రాస్తారోకో నిర్వహించారు. కాలుష్యాన్ని వెంటనే అరికట్టాలని, రోడ్లపై నీళ్లు చల్లాలని డిమాండ్ చేశారు.