NLR: రాపూరు పట్టణంలో శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి 7:30కు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ తరలిరావాలని కోరారు.