VSP: బీచ్ రోడ్ ఏయూ యోగా విభాగంలో ఆదివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వర్షాకాల వ్యాధులపై ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య కె.రమేష్ బాబు తెలిపారు. కేజీహెచ్ పూర్వ సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ కె.ఈశ్వర రావు వర్షాకాల వ్యాధులైన చర్మవ్యాధులు, దగ్గు, జలుబు తదితర వ్యాధులకు చికిత్స అందిస్తారు.