మన్యం: జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సోమవారం గుమ్మలక్ష్మీపురం మండలం వైటిసీలో గర్భిణుల వసతి గృహాన్ని సందర్శించి, పరిసరాలను స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సదుపాయాలపై అక్కడ గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలో జీడిపప్పు, ఇతర ప్రాసెసింగ్, నాటు కోళ్ల పెంపకం యూనిట్లను పరిశీలించారు.