SS: మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కలిశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై తమ అధినేత కీలక సూచనలు చేశారని పేర్కొన్నారు.