W.G: కాలువలు, డ్రైన్ల ఆక్రమణలు తొలగించి ముంపు బారిన పడకుండా చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. బుధవారం ఉండి మండలం యండగండి, కోలమూరు, పాములపర్రు పంటకాలువ పూడిక పనులు, ఆక్రమణలు తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. రెండు దశాబ్దాలుగా కాలువలు ఆక్రమణలు గురై రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.