CTR: జిల్లాలో ఈనెల 24న స్వచ్చరథాలు ప్రారంభించనున్నట్లు డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. తొలి విడతగా చిత్తూరు, ఐరాల, బంగారు పాల్యంలో స్వచ్ఛ రథాలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారన్నారు. మార్చిలోపు జిల్లాలోని మిగిలిన 24 మండలాల్లో రథాలను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి నిర్వహణ కోసం మండల పరిషత్ నుంచి ప్రతినెల రూ.25 వేలు చెల్లించనున్నట్టు చెప్పారు.