అన్నమయ్య: PGRS ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల సమస్యలను ఆయన నేరుగా విన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.