PLD: కూటమి ప్రభుత్వం తన ఆస్థులపై దాడి చేసే ప్రయత్నం చేస్తుందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దార్థనగర్లోని క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం అంబటి మాట్లాడారు. తనకు సత్తెనపల్లిలో ఉన్న 20 ఎకరాల పొలానికి సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారన్నారు. కృష్ణానది గర్భంలో ఇళ్లు కట్టిన చంద్రబాబు తనను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు.