ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం వైసీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. నాయకులు ఖలీల్, జింకల రామాంజనేయులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీ, శానిటేషన్, సమస్యలు ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి వార్డులో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.