GNTR: ప్రజలకు సులభంగా న్యాయం అందించడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యొక్క ప్రధాన ఉద్దేశమని ఎస్పీ వకుల్ జిందాల్, తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.