ప్రకాశం: ఒంగోలు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దారుణమని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా మద్యం కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు.