KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా, కార్మికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.