ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో ఉపాధి హామీ పథకం కింద 445 ఇంకుడు గుంతలు మంజూరైనట్లు ఏపీవో శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో డీఎల్డీవో, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి సోక్ పిట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 168 ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు.