GNTR: అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.