జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చండి హవనం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి రాజుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.