E.G: దసరా సందర్భంగా విజయవాడకు పాదయాత్రగా వెళ్లే భవాని భక్తులు తప్పనిసరిగా సర్వీస్ రోడ్లు వెంబడి వెళ్లాలని DSP జి.దేవకుమార్ ఆదివారం తెలిపారు. పుల్లలపాడులో సంభవించిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరం అని ఆయన అన్నారు. సాధ్యమైనంత వరకు భక్తులు రాత్రి పూట ప్రయాణం మానుకోవాలని కోరారు. తప్పనిసరిగా తమకు రేడియం స్టిక్కర్లను అతికించుకోవాలని భక్తులకు సూచించారు.