ATP: అనంతపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జెండా త్యాగం, సేవ, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అని అన్నారు. ప్రజలకు చేరువై సేవ చేయడం ప్రతి నాయకుడు, కార్యకర్త ధ్యేయమై ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.