గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు పూర్తిగా నివారించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో చోటుచేసుకున్న నాలుగు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించిన ఆమె, నివారించగలిగిన కేసుల్లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలని సూచించారు.