ELR: వరదల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతిన్న గ్రామాలలోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇంఛార్జ్ ఆర్డీవో ఎం.ముక్కంటి చెప్పారు. వేలేరుపాడు మండలం 24 గ్రామాలోని 2511 కుటుంబాలకు 94.16 క్వింటాళ్ల కూరగాయలు నిత్యవసర సరుకులు అందించారు. కుక్కునూరు మండలం 4 గ్రామాలలోని 563 కుటుంబాలకు 21.12 క్వింటాళ్ల కూరగాయలను అందించామన్నారు.