TPT: ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అత్తివరం రవీంద్ర అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఎస్సీ కులానికి చెంది గూడూరు మండలం ఇందిరమ్మ కాలనీ ఒకటవ వీధికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, మృతుడు స్నేహితులతో కలిసి ఆదిశంకర కాలేజ్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి దగ్గర గల నీటిలో దిగి ప్రమాదవశాత్తు మరణించాడు.