E.G: 2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో AP MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో రాజమండ్రి MP పురందీశ్వరికి 13వ స్థానంలో నిలిచారు. మొత్తం 73 ప్రశ్నలు అడగటంతోపాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆమె హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు తెలిపారు.