VZM: నెల్లిమర్లలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం ఆంజనేయస్వామి వారికి పంచామృత అభిషేకం, విశేష పుష్పార్చన, సింధూరార్చన, తమలపాకు అర్చన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. అర్చకులు విశేష పూజలు జరిపించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ వైవీ.శ్రీనివాసరావు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.