NLR: సామాజికంగా వెనుకబడి వున్న గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటు పడతానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు 500 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.