కృష్ణా: గ్రామాల అభ్యున్నతి ద్వారానే దేశ అభ్యుదయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కేడీసీసీ బ్యాంకు ప్రాంగణంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, భూమి తనఖా బ్యాంక్ మాజీ అధ్యక్షుడు అడుసుమిల్లి అశ్వర్ధ నారాయణమూర్తి కాంస్య విగ్రహలను ఛైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.