CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రేపటి పర్యటన షెడ్యూల్ను ఆయన కార్యాలయం సోమవారం విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు కార్వేటినగరంలో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. అనంతరం పాలసముద్రం, వెదురుకుప్పం, కార్వేటి నగరం మండలాల నీటి సంఘం సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.