GNTR: తెనాలి చెంచుపేట ఈద్గాలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన ఆయన, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కఠోర దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సేవలను అభినందించారు.