సత్యసాయి: లేపాక్షి మండలం 33/11 కేవీ కల్లూరు సబ్స్టేషన్ పరిధిలోని వ్యవసాయ బోర్లకు నేటి నుంచి విద్యుత్ వేళల్లో మార్పు అమలు చేయనున్నట్లు ఏఈ వెంకటేశులు తెలిపారు. తిమ్మిగానిపల్లి, వడ్డిపల్లి ఫీడర్లకు రాత్రి 12–3, ఉదయం 6–12 గంటలు, బైరాపురం, ఉప్పరపల్లి ఫీడర్లకు రాత్రి 3–6, మధ్యాహ్నం 12–18 గంటల వరకు త్రిఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు.