NDL: ప్యాపిలి పట్టణంలో గత ఎనిమిది రోజులుగా తీవ్రమైన నీటి కష్టాలు నెలకొన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేసేందుకు ప్రజలు రూ.300–రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటి పన్ను వసూలు చేసే సమయంలో వచ్చే అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.