కర్నూల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టనున్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.