ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పీ.రోహిణి తెలిపారు. డెలివరీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు తదితర పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.